వైభవంగా లష్కర్ బోనాలు.. భారీగా తరలి వస్తున్న భక్తులు

84చూసినవారు
వైభవంగా లష్కర్ బోనాలు.. భారీగా తరలి వస్తున్న భక్తులు
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ.. భక్తుల కొంగుబంగారం ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. లష్కర్ బోనాలు భాగ్యనగరానికి కొత్త శోభను తీసుకొచ్చాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారు జామునుంచి లష్కర్‌ బోనాలు ప్రారంభమయ్యాయి. భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించి మొక్కు తీర్చుకుంటున్నారు భక్తులు.

సంబంధిత పోస్ట్