నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ, సంక్షేమ రంగాలకు పెద్దపీటవేశామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలకు బడ్జెట్ హామీ పత్రమని ఎమ్మెల్యే వివరించారు.