ఇండ్ల స్థలాలు ఇవ్వాలి: సిపిఎం డిమాండ్

53చూసినవారు
ఇండ్ల స్థలాలు ఇవ్వాలి: సిపిఎం డిమాండ్
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం రంగాపూర్ గ్రామం పరిధిలో గల దేవుని తండాలో అర్హులైన వారికి వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ మంగళవారం డిమాండ్ చేసింది. ఆ పార్టీ నాయకులు చింతా ఆంజనేయులు, బాలస్వామి మాట్లాడుతూ, 1992లో పేదల కోసం దేవుని తాండలో ప్రభుత్వం స్థలం ఇచ్చిందని, ఇప్పటి వరకు ఆ స్థలాన్ని పేదల ఇండ్లకు కేటాయించలేదని అన్నారు. ఇప్పటికైనా ఆస్దలంలో ఇండ్లు ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్