నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండల కేంద్రంలో బుధవారం 138వ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, సిఐటియు జిల్లా నాయకులు శివరాములు, సిపిఎం మండల కార్యదర్శి బాలస్వామి మాట్లాడుతూ, మేడే ప్రాముఖ్య్యాన్ని వివరించారు. కార్మిక హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.