యాక్సిడెంట్ లో ముగ్గురు మృతి

40929చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కేంద్రం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిలోని టోల్ గేట్ సమీపంలో ఓ కారు చెట్టుకు వేగంగా ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వారు హైదరాబాద్ నుంచి కడపలో జరిగే పెళ్లికి వెళుతున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్