పంటల నమోదు త్వరితగతిన పూర్తిచేయాలి: కలెక్టర్ సంతోష్

58చూసినవారు
పంటల నమోదు త్వరితగతిన పూర్తిచేయాలి: కలెక్టర్ సంతోష్
జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్వహిస్తున్న పంటల నమోదు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఐడీఓసి సమావేశ మందిరంలో శనివారం వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలలో పంటలు సాగు అయ్యాయని, ఏఏ పంటలు సాగుచేశారని, పంటలు ఏదశలో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎక్కువగా పత్తి, కంది, మిరప సాగు చేశారని వ్యవసాయ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్