బీసీలకు 56% రిజర్వేషన్లు కేటాయించాలి: మాజీ మంత్రి

64చూసినవారు
బీసీలకు 56% రిజర్వేషన్లు కేటాయించాలి: మాజీ మంత్రి
మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం హైదరాబాద్ లో బీసీ రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 56% రిజర్వేషన్లు కేటాయించాలని, 90 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలుచేయాలి, కులాలవారీగా జనాభా లెక్కలు సేకరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్