మహబూబ్ నగర్ పట్టణంలో ఏప్రిల్ 1 సోమవారం నుండి తై బజారు రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తైబజార్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నిర్ణయించామని తెలిపారు. తైబజార్ వల్ల చిన్న వ్యాపారులు జీవనోపాధిని కోల్పోతున్నారని ఎమ్మెల్యే అన్నారు.