మహబూబ్ నగర్ పార్లమెంటు అభివృద్ధికి పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నానని, ఎన్నికలలో గెలవగానే అమలు పరచి చూపిస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శనివారం మహబూబ నగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంవీఎస్ కాలేజీ మైదానంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. పాలమూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ప్రజలు తనను ఆదరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.