పాలమూరు అభివృద్ధికి ప్రణాళికలతో ఉన్నా: డీకే

70చూసినవారు
మహబూబ్ నగర్ పార్లమెంటు అభివృద్ధికి పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నానని, ఎన్నికలలో గెలవగానే అమలు పరచి చూపిస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శనివారం మహబూబ నగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంవీఎస్ కాలేజీ మైదానంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. పాలమూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ప్రజలు తనను ఆదరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్