మహబూబ్ నగర్ లో భారీ వర్షం

74చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శనివారం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. ఎట్టకేలకు వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా రామయ్య బౌలి, షాషాబ్ గుట్ట, తదితర ప్రాంతాల్లో రోడ్లపై మురుగునీరు పెద్ద ఎత్తున పారింది. డ్రైనేజీలు నిండుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్