స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం మాట్లాడుతూ. 'కాంగ్రెస్ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేస్తాం. కార్యకర్తల కోసం నేతలంతా పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తా' అని వ్యాఖ్యానించారు.