ఆలయంలో అర్ధరాత్రి దొంగలు... హుండీ చోరీ

65చూసినవారు
ఆలయంలో అర్ధరాత్రి దొంగలు... హుండీ చోరీ
ఆలయంలో దొంగలు పడి హుండీ డబ్బులు చోరీ చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. శ్రీనివాస కాలనీలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగలు వెంకటేశ్వరస్వామి హుండీ తాళం పగులగొట్టి కరెన్సీ నోట్లను తీసుకొని, చిల్లర డబ్బులను గుడి ప్రాంగణంలో వెదజల్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ గాంధీ నాయక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్