చరవాణిలో ఆట ఆడుతుండగా.. డబ్బు మాయం

83చూసినవారు
చరవాణిలో ఆట ఆడుతుండగా.. డబ్బు మాయం
చరవాణిలో ఆట ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్న సంఘటన మంగళవారం జడ్చర్ల నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఎస్ఐ వీరబాబు వివరాలు. ఊర్కొండ మండలం నర్సంపల్లిలో వీరెడ్డి శేఖర్ రెడ్డి కుమారుడు ప్రతాప్ రెడ్డి చరవాణిలో ఆట ఆడుతుండగా మనీ 777 క్యాసినో అనే లింక్ రాగా లింక్ పై క్లిక్ చేశాడు. దీంతో 5 విడతలుగా రూ. 67, 899 బ్యాంకు ఖాతాలో నుంచి బదిలీ అయ్యాయి. 1930కు సమాచారం ఇచ్చి పీస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్