అనంత్‌నాగ్- రాజౌరీ పోలింగ్ వాయిదా

59చూసినవారు
అనంత్‌నాగ్- రాజౌరీ పోలింగ్ వాయిదా
అనంత్‌నాగ్‌-రాజౌరీ లోక్‌సభ స్థానానికి మే 7న జరగాల్సిన ఎన్నికల పోలింగ్‌ వాయిదా పడింది. ప్రతికూల వాతావరణం, రవాణా సమస్యలను పేర్కొంటూ ఈసీ పోలింగ్‌ను మే 25కు వాయిదా వేసింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం-1951లో సెక్షన్‌-56 కింద పోలింగ్‌ తేదీని మే 7 నుంచి 25కు మార్చినట్టు తెలిపింది. ఈ స్థానం నుంచి పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ సహా మొత్తం 20 మంది అభ్యర్థులు పోటీకి నిలబడ్డారు.

సంబంధిత పోస్ట్