ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయడానికి శుక్రవారం సాయంత్రం 5: 00 గంటల వరకు చివరి గడవని తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు ఇప్పటివరకు వరకు 1, 113 పోస్టల్ ఓట్లు పోలయ్యాయని, ఈనెల 13న జరిగే పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఏఆర్వో కుమార్ దీపక్ ఏర్పాట్లపై సిబ్బందితో చర్చించారన్నారు. పోలింగ్ ప్రక్రియ విదులలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు విధిగా హాజరై పోలింగ్ విజయవంతం చేయాలని తహసీల్దార్ కోరారు.