కారు బైక్ ఢీ... ముగ్గురు ఎగిరి పడ్డారు

8658చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా ఆమనగల్లు మండలం విఠాయిపల్లి సమీపంలోని ఫంక్షన్ హాల్ ఎదుట శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. బైక్ పై వస్తున్న వారిని కారు ఢీకొనడంతో వారంతా ఎగిరి రోడ్డు అవతల పడ్డారు. ఆ సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కాగా ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్