May 10, 2024, 17:05 IST/వనపర్తి
వనపర్తి
బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర చేస్తుంది: సిపిఎం
May 10, 2024, 17:05 IST
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర చేస్తుందని వనపర్తి సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు ఆరోపించారు. శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆంజనేయులు మాట్లాడుతూ. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ ను ఎన్నికలలో ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.