నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో శుక్రవారం ముసలి సంచారం కలకలం రేపింది. దీంతో మండలంలోని తాలంకేరి గ్రామంలో గల చెరువులో ఒడ్డుపై సీత తీరుతూ భారీ మొసలి ప్రజలకు కంటపడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చెరువులో నిత్యం రైతులు పశువుల కాపరులు వాటి దాహం తీర్చడానికి వెళ్లి ముసలి బారిన పడతారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ముసలిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.