ముళ్ల చెట్లు, మట్టిని తొలగించిన పోలీసులు

83చూసినవారు
మక్తల్ మండలం రుద్ర సముద్రం గ్రామానికి వెళ్ళే దారిలో వాగుపై నీరు వెళ్లకుండా అడ్డుగా ఉన్న ముళ్ళ కంపను, మట్టిని ఆదివారం పోలీసులు చేసే విధానంతో తొలగించారు. గ్రామానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు పోలీసులు జేసిబి సహాయంతో నీరు వెళ్లకుండా అడ్డుగా ఉన్న ముళ్ళ కంప, మట్టిని తొలగించారు. ఆపదలో ఉంటే డయల్ 100 ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.

సంబంధిత పోస్ట్