కంప చెట్ల మధ్య మృతదేహం

16934చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండల శివారులోని పెద్ద చెరువు సమీపంలో కంప చెట్ల మధ్య గురువారం వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు తెలకపల్లి ఎస్ఐ తెలిపారు. చెట్ల పొదల్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వయసు 40- 45 ఏళ్లు ఉంటాయని, ముఖం పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉందన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే తెలకపల్లి ఎస్ఐ 8712657715, సీఐ 8812657711 సమాచారం ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్