ఓటు హక్కు వినియోగించుకున్న అదనపు కలెక్టర్

74చూసినవారు
ఓటు హక్కు వినియోగించుకున్న అదనపు కలెక్టర్
జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ కే. సీతారామారావు సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూల్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు చాలా ప్రాధాన్యం ఉన్నదని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్