నారాయణపేట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ నవాజ్ మూస మంగళవారం సీవీఆర్ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన, ఆరు గ్యారెంటీలకు ఆకర్షితులై పార్టీలో చేరారని, వారికి ఆముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు అభిజిత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.