ఎంపీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలి

66చూసినవారు
ఎంపీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలి
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని దానిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమంత రావు అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈసీ అనుమతితో పదోన్నతులు చేపట్టాలని, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న డిఏ లను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్