సమస్యాత్మక గ్రామాలలో పోలీసుల కవాతు

548చూసినవారు
సమస్యాత్మక గ్రామాలలో పోలీసుల కవాతు
దామరగిద్ద మండలంలోని నర్సాపూర్, లోకుర్తి సమస్యాత్మక గ్రామాలలో గురువారం ఇండో టిబెట్ బార్డర్ ఫోర్స్ సాయుధ బలగాలతో కవాతు నిర్వహించినట్లు ఎస్సై వసంత తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రజలకు భద్రతపై భరోసా కల్పించేందుకు కవాతు నిర్వహించామని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్