వాలంటీర్ల వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని వెల్లడించారు. "వాలంటీర్లు వైసీపీకి పని చేయడం సరికాదు. ప్రజలకు సేవ చేయాలని వారిని కోరుతున్నా. ఎండలో సచివాలయానికి వెళ్లడం వల్ల ఒకరిద్దరు చనిపోయారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇచ్చే వీలుంది. కానీ సీఎం జగన్ కావాలనే అలా చేయించలేదు." అని ఆయన ఆరోపించారు.