శనీశ్వర ఆలయంలో త్రయోదశి పూజలు

61చూసినవారు
శనీశ్వర ఆలయంలో త్రయోదశి పూజలు
శని త్రయోదశి పురస్కరించుకుని శనివారం నారాయణపేట పట్టణంలోని శనీశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి తిల తైలం, నల్లటి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. స్వామి వారిని దర్శనం చేసుకుని పూజలు చేస్తే దోషాలు తొలగుతాయని ఆలయ అర్చకులు చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్