మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

59చూసినవారు
మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఆయనను పోలీసులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ తర్వాత కస్టడీని ఏప్రిల్ 18 వరకు కోర్టు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఆయనను ED గత ఏడాది ఫిబ్రవరి 26న ఆయనను అరెస్ట్ చేసింది.

సంబంధిత పోస్ట్