చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

7546చూసినవారు
చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
వనపర్తి జిల్లా కేంద్రంలో చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. జిల్లా కేంద్రంలోని రాయిగడ్డ కాలనీకి చెందిన ఉందేకోటి కృష్ణ(42) మంగళవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నల్లచెరువులో పడి నీట మునిగి గల్లంతైన విషయం తెలిసిందే. పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్