ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కేసు: ఎస్పీ

61చూసినవారు
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కేసు: ఎస్పీ
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వ్యక్తులపై కేసు నమోదు చేశామని మంగళవారం వనపర్తి ఎస్పి రక్షిత కె. మూర్తి తెలిపారు. కొత్తకోట మండలం నాటవెల్లి, పెద్దతండాలో కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చల్లా వంశీధర్ రెడ్డి, హస్తం గుర్తు గల గోడ గడియారాలు పంపిణీ చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్