పంటలు ఎండి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి: రాబర్ట్

51చూసినవారు
పంటలు ఎండి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి: రాబర్ట్
వనపర్తి జిల్లాలో భూగర్భ జలం తగ్గి పంటలు ఎండి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30, 000 పరిహారం ఇవ్వాలని బుధవారం తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాబర్ట్ ప్రభుత్వాన్ని కోరారు. వనపర్తి, పానగల్, గణపురం తదితర మండలాలలో పంటలు ఎండి పశువులు, గొర్రెలకు వదిలేశారన్నారు. ఈ పరిస్థితిలోనూ పంట రుణాలు చెల్లించమని కొన్ని చోట్ల బ్యాంకర్లు రైతులను నోటీసులు ఇస్తున్నారని, రూ. 2 లక్షల రుణమాఫీ దాకా ఆగాలని ఆదేశాలు ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్