అభివృద్ధి పనులను ప్రారంభించండి: సతీష్ యాదవ్

56చూసినవారు
వనపర్తి జిల్లాలో గత 8 నెలలుగా ఆగిపోయిన పలు అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే పట్టణంలో ఆగిపోయిన రోడ్ల వెడల్పును వెంటనే ప్రారంభించి, ప్రజల ఇబ్బందులను తొలగించాలన్నారు. వనపర్తిలో అభివృద్ధి పనులను ఆపేసి రాజకీయాలపై దృష్టి పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్