ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15 కొత్త రైల్వే లైనుల సర్వేకు నిధులు మంజూరు చేస్తూ డోర్నకల్ గద్వాల సూర్యపేట రైల్వే లైన్ మంజూరు అయినట్లు ఆదివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జిల్లెల్ల చిన్నారెడ్డి తెలిపారు. సర్వే పనుల కోసం నిధులు మంజూరు అయ్యాయని, సర్వే కూడా ప్రారంభమైన సంగతి గుర్తు చేశారు. రాబోయే 2025 సంవత్సరం నాటికి పనులు పూర్తి అవుతాయని కొత్త రైల్వే మార్గం ద్వారా వనపర్తి ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.