వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు, ఈత నేర్చుకోవడానికి జలాశయాల వద్దకు వెళ్లే అవకాశం ఉందని గురువారం వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కె. మూర్తి అన్నారు. నీటిలో మునిగి ప్రాణనష్టం జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈత సరదా. విషాదం కాకూడదని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాలు, చెరువులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పి పేర్కొన్నారు.