స్వార్ధ రాజకీయాల కోసం చెరువుని ధ్వంసం చేశారు: మేఘారెడ్డి

72చూసినవారు
స్వార్ధ రాజకీయాల కోసం గోపాల సముద్రం చెరువుని ధ్వంసం చేశారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామ గోపాల సముద్రం చెరువును ఆయన రైతులు, అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ ను ఆక్రమించిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయకట్టుదారులకు రెండు పంటకు సైతం సాగునీరు అందిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్