వనపర్తి జిల్లా కేంద్రంలో ఈనెల 11 న కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో నిర్వహించే బహిరంగ సభ, హెలిపాడ్ ఏర్పాట్లను ఎస్పీ రక్షిత కే మూర్తి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బందోబస్తుకు సంబంధించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.