నెన్నెల మండలం కోనంపేట గ్రామ శివారులోని మామిడి తోటలో కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఈ దాడుల్లో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద రెండు కోళ్లు, రెండు కత్తులు, రూ. 5 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.