Jul 18, 2024, 16:07 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
మత్తు పదార్థాల నిర్మూలనకై అవగాహన
Jul 18, 2024, 16:07 IST
యువత మత్తు పదార్థాలకు బానిసకావద్దని నెన్నెల ఎస్సై రాజశేఖర్ అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మత్తు పదార్థాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల భవిష్యత్తులో అనారోగ్య, మానసిక సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. మత్తు పదార్థాలు వినియోగించినా, విక్రయించిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.