నెన్నెల మండలంలో శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటించనున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో తలపెట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అంతే కాకుండా ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.