ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సబ్బెపల్లి విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులచే తయారు చేయబడిన మట్టి గణపతులను తీసుకొని హాజీపూర్ గ్రామంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.