కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసిన బింగి ప్రవీణ్

63చూసినవారు
కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసిన బింగి ప్రవీణ్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన బీజేపీ యువ నాయకులు బింగి ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ లోని కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ తో కలిసి ఆయన కేంద్రమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ను బండి సంజయ్ శాలువా కప్పి సత్కరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్