21న రైతు సదస్సును జయప్రదం చేయాలి

69చూసినవారు
ఈ నెల 21న గోదావరిఖనిలోని సింగరేణి కమ్యూనిటీ హాల్ లో జరిగే రైతు సదస్సును జయప్రదం చేయాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు ముద్దమల్ల భార్గవ్ పిలుపునిచ్చారు. సోమవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతు సదస్సు కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, కాసీం, తదితరులు హాజరు కానున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్