మంచిర్యాల నుండి హైదరాబాద్ మధ్య నడిచే నాలుగు స్లీపర్ ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శనివారం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ హైదరాబాద్ కు వెళ్ళే వారికి ఈ బస్సులు ఎంతో సౌకర్యంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికులు బస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.