విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం టిపియూఎస్ ధర్నాలు

85చూసినవారు
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం టిపియూఎస్ ధర్నాలు
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టిపియూఎస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బుధవారం మంచిర్యాల జిల్లాలోని మండల కేంద్రాల్లో తహశీల్ధార్ కార్యాలయాల ముందు ధర్నాలు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ధర్నాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న సమస్యలు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, 63% ఫిట్మెంట్ తో వెంటనే పిఆర్సి ప్రకటించాలని, బదిలీలు పదోన్నతులు షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని తదితర డిమాండ్లతో ఈ ధర్నా చేపట్టడం జరిగింది. లక్సెట్టిపేట మండల కేంద్రంలో టిపియూఎస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్, తాండూరు మండల కేంద్రంలో టిపియూఎస్ జిల్లా అధ్యక్షులు రవి కుమార్, జైపూర్ మండల కేంద్రంలో టిపియూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రావు నాయకత్వం వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్