పవర్ ప్లాంట్ ప్రారంభించాలని కార్మికుల నిరసన

55చూసినవారు
పవర్ ప్లాంట్ ప్రారంభించాలని కార్మికుల నిరసన
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన బయోమాస్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ బుధవారం కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్ మాట్లాడుతూ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ముగిసిందని గత 20 నెలలుగా కంపెనీని మూసివేయడంతో కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం ద్వారా కంపెనీకి పీపీఏ ఇప్పించి తమను ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్