అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెత్తుల నరేష్ యాదవ్ 200 మందితో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సంఘం జిల్లా అధ్యక్షులు బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన వారికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు.