మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బంగ్లాలోని వేప చెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించాయి. స్వయంగా మంత్రే సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఇక, నెట్టింట వైరల్గా మారిన ఈ వీడియోను చూసి అందరూ షాక్ అవుతున్నారు.