మణిపూర్‌ మళ్లీ ఉద్రిక్తం

61చూసినవారు
మణిపూర్‌ మళ్లీ ఉద్రిక్తం
నివురు గప్పిన నిప్పులా ఉన్న మణిపూర్‌ మళ్లీ రాజుకుంది. ఇటీవల కొన్ని గ్రామాలపై డ్రోన్లతో దాడులు జరగటంతో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిరిబామ్ జిల్లాలో జరిగిన హింసలో ఆరుగురు మరణించారు. కుకీ, మెయితీ తెగల పోటాపోటీ ప్రదర్శనలు, తమ తమ డిమాండ్ల పునరుద్ఘాటన మళ్లీ తెర మీదికి వచ్చి, పరిస్థితిని ఉద్రిక్తభరితం చేస్తున్నాయి. రాష్ట్ర భౌగోళిక సమగ్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మణిపుర్‌ సీఎం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్