2040 నాటికి చంద్రుడిపైకి మనుషులు: సోమ్‌నాథ్

59చూసినవారు
2040 నాటికి చంద్రుడిపైకి మనుషులు: సోమ్‌నాథ్
చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు వీలుగా NGLV(నెక్స్ట్ జనరేషన్ లాంఛ్ వెహికల్) అనే భారీ రాకెట్‌ను నిర్మిస్తున్నట్లు ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ వెల్లడించారు. దీన్ని ‘సూర్య’ అని పిలుస్తున్నట్లు తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్, మీథేన్ ఆధారంగా ఇంజిన్‌ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని LEO పేలోడ్ కెపాసిటీ 40టన్నులకు పైగా ఉంటుందని చెప్పారు. 2040 నాటికి చంద్రుని ఉపరితలంపైకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్