ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ పరిధిలో పలు రైళ్లు రద్దు

68చూసినవారు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసింది. తిరుపతి మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను తెనాలి మీదుగా దారి మళ్లించారు. కృష్ణా, శబరి, విశాఖ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్ ఐదున్నర గంటలు ఆలస్యంగా నడుస్తోంది. వైజాగ్-నాందేడ్, నాందేడ్- వైజాగ్ రైళ్లను కూడా రద్దు చేశారు.

సంబంధిత పోస్ట్