కాంకేర్ జిల్లా మాడ్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేత శంకర్రావు ఉన్నారు. ఈయన మీద రూ.25 లక్షల రివార్డు ఉంది. సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు స్వస్థలం జయశంకర్-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామం. తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే పీపుల్స్వార్ గ్రూప్(ప్రస్తుతం మావోయిస్టు పార్టీ) సిద్ధాంతాలకు ఆకర్షితుడై సానుభూతిపరుడిగా పనిచేసేవారు.